Monday, July 27, 2009

‘విఘ్నేశ్వరా-6

‘‘విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూంటాయి. ముందుకాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రే…యస్సుల కోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జ…యప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. భూలోకంలో వైభంగా జరిగే ఉత్స వాలన్నిటికీ గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది!'' అని ఆకాశవాణి పలికింది. విష్ణువు విఘ్నేశ్వరుడితో, ‘‘పార్వతీనందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొకపని కూడా కల్పించావా!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘మేనమామ వరసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపుతావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా నీరజాక్ష!'' అన్నాడు. విష్ణువు, ‘‘విఘ్నవినాశకా! నీ పరశువు ముందు, నా చక్రా…ుుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూసినప్పుడు మహముచ్చటేసింది సుమా!''అన్నాడు. ‘‘పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రి…యుల్ని తెగ నరుకుదువుగానిలే!''అన్నాడు విఘ్నేశ్వరుడు. విష్ణువు, ‘‘గజవిఘ్నాసురుడి మీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జు రూపం కూడా నన్నెంతో మురిపించిందోయి!'' అన్నాడు. ‘‘అలాగైతే, వామనుడివై బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుదువుగానిలే!'' అని విఘ్నేశ్వరుడు అన్నాడు.

చందమామ 1947 నాటి మొట్తమొదటి పేజి


.

Sunday, July 26, 2009

విఘ్నేశ్వరుడు - 5

పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరిచి పోయి, పిల్లవాణ్ణి ఎత్తుకుని దిష్టి తీసింది. శివుడు చేతులు చాచి పిలిచాడు. మళ్ళీ ఏం చేసిపోతాడో అని భ…ుం భ…ుంగా తప్పట డుగులువేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్టకు అంతా ముచ్చటపడ్డారు. ‘‘నా…ునా, విఘ్నేశ్వరా! నిన్ను పుత్రు డిగా పొంది ధన్యులం అ…్యూం. చిరంజీవ!'' అని శివుడు ఎత్తి ముద్దాడుతూంటే విఘ్నే శ్వరుడు కిందకు దూకి, ‘‘తండ్రీ! ఎంతమాట, నేను మీ కొడుకును, ధన్యుణ్ణి నేను!'' అంటూ పార్వతీ శివుల పాదాలను చిరుతొండంతో చుట్టి, కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు. తరవాత బుల్లిబుల్లి అడుగులతో వెళ్ళి, విష్ణువును సమీపించి ఆ…ునకు ప్రణామం చేశాడు. విష్ణువు, ‘‘రావోయి ముద్దుల మేనల్లుడా!'' అని దగ్గరకు తీసుకొని, ‘‘కళ్యాణమస్తు!'' అని దీవించాడు. అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకూ, విఘ్నేశ్వరుడికీ ఏవో పోలికలున్నట్లు అంద రికీ తోచింది. అదే మేనమామ పోలిక అంటే! అని అనుకున్నారు. వినా…ుకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ, ‘‘తొలిపూజలందుకోవ…్యూ బొజ్జ గణప…్యూ!'' అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటిక వేశాడు. తర్వాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి, సరస్వతికి మ్రొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతణ్ణి ఎత్తు కుని చెరో చెంపా ముద్దాడి, ‘‘మేము విఘ్నే శ్వరుడి ఇరుపక్కలా అత్తాకోడళ్ళ పొరపొ చ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము!''

.

Thursday, July 23, 2009

సుందరకాండ - 4

త్రిజట తన కల గురించి రాక్షసస్ర్తీలకు చెబుతూండగా మరోవైపు సీత దుఃఖ వివశురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో, రాక్షస స్ర్తీలో తనను తప్పక చంపుతారనీ, తాను రాముడి కొరకు ఇంత కాలమూ ఎదురు చూడటం నిష్ర్పయోజన మయిందనీ ఆమె అనుకున్నది. నోరెండిపోతూ ఆమె శింశుపా వృక్షం కిందికి పోయి, ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేస్తూ తన జడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభ శకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఈ శుభ శకునాలు చూసి ఆమెకు కొత్త ప్రాణం వచ్చినట్టయింది.
ఇంతసేపూ శింశుపా వృక్షంలో కూర్చుని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు. అన్నీ విన్నాడు. కాని అతనికి ఏం చెయ్యటానికీ ఒకంతట పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి, ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగిపోతే సీతకు రాముడి విషయం తెలియదు; ఆమె ఇక్కడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీ గాక, ‘‘సీత ఏమన్నది?'' అని రాముడు తప్పక అడుగుతాడు. ‘‘నేనామెతో మాట్లాడలేదు,'' అంటే రాముడు తన చూపులతోనే నన్ను దగ్ధం చేస్తాడు. పోనీ సీతతో మాట్లాడతామంటే రాక్షస స్ర్తీలంతా ఉన్నారు. పైగా, సీత తనను చూసి రావణుడే మాయూ రూపంలో వచ్చాడనుకుంటుందేమో! అప్పు డామె భయపడి కెవ్వున అరవగానే రాక్షస స్ర్తీలు తన పైకి ఆయుధాలతో వస్తారు

.

విఘ్నేశ్వరుడు - 4

పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణి చూసి, శివుణ్ణి చురచుర చూస్తూ, ‘‘ఎంత పనిచేశావు! మన పుత్రుణ్ణి నరికావు! పుత్రహంతకుడివి!'' అంటూ కుప్పలా కూలబడి భోరుమని శోకించసాగింది. అంతవరకు స్తంభించిపోయి చూస్తున్న గుంపులో ఒక్కసారిగా కలకలం సముద్ర ఘోషలాగా చెలరేగింది. పెద్దనేరం చేసిన వాణ్ణిలాగ శివుణ్ణి చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కముఖం పెట్టి, ‘‘నాకు తెలి…ుని పుత్రుడా! ఎలాగ వచ్చాడు?'' అన్నాడు.
పార్వతి తనవంటికి పెట్టుకున్న నలుగు ముద్ద ఏవిధంగా పుత్రగణపతి అయినదీ చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి, కోపంగా చూస్తూ, ‘‘నీకు కుమారుడైతే కావచ్చు. అందుకే అమ్మ, అమ్మ అంటూ తెగ వాగాడు. మన పుత్రుడంటున్నావు, ఆ పొగరుబోతు నాకుపుత్రుడెలాగ అవుతాడు?''అని అడిగాడు.
పార్వతి తెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగచేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి, ‘‘శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్న ప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించి పులకరింపజేసింది. అది మొదలు శివుడు, పార్వతిలో సగభాగంగా అంతర్లీనమై ఉంటూనే ఉన్నాడు. పుత్రగణపతి శివుడి కుమారుడే!'' అని నాలుగు నోళ్ళతో నొక్కి చెప్పాడు.
శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూంటే, పార్వతి బాలుడి కళేబరం మీద పడి ఏడుస్తూంటే, ఆకాశం నుండి, ‘‘ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూన్న తలను తెచ్చి నాకు అతకండి, నేను లేస్తాను!'' అన్న పుత్ర గణపతి వాక్కులు వినిపించాయి

Sunday, July 19, 2009

సుందరకాండ - 3

శింశుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుపక్కలన్నీ
కలయ జూశాడు. అశోకవనం దేవేంద్రుడి నందన వనం లాగుంది. దాని నిండా
పూల చెట్లూ, పళ్ళ చెట్లూ ఉన్నాయి. పక్షులూ, మృగాలూ ఉన్నాయి. అక్కడక్కడా
దివ్యమైన భవనాలూ, అరుగులూ; తామర పూలూ, కలువపూలూ గల
మడుగులున్నాయి. అన్నిటికన్న అశోక వృక్షాలు జాస్తిగా ఉన్నాయి.
కొద్ది దూరంలో ఒక ఎత్తయిన తెల్లని మండపం ప్రకాశిస్తున్నది.
అందులో వెయ్యి స్తంభాలున్నాయి. దానిలో పగడాలతో తయూరు చేసిన మెట్లూ,
బంగారు అరుగులూ ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలో ఉన్నది. తరవాత
హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కొట్టుకుని ఉన్నది.
ఆమె చుట్టూ రాక్షస స్ర్తీలున్నారు. ఆమె బాగా కృశించి, నిట్టూర్పులు విడుస్తూ,
దైన్యంతో కూడుకుని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకుని
ఉన్నది.నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడలాగా అట్టకట్టుకుపోయి
తుంటి దాకా వేళ్ళాడుతున్నది. ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు
ఈ విధంగా వితర్కించుకున్నాడు: రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు
ఆ స్ర్తీలో తనకూ, సుగ్రీవాదులకూ కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి.
నిండు చంద్రుడి వంటి ముఖం. తీర్చినట్టుండే కనుబొమలు, నల్లని వెంట్రుకలు,
అందమైన నడుము-సీత ఎంత కృశించి, శోక సముద్రంలో మునిగి ఉన్నా ఈ
లక్షణాలు దాగటం లేదు.

దెయ్యాల పండుగ

బౌద్ద సన్యాసులు తన కుమారుడిని తీసుకుపోకుండా చేయడానికి ఆమె ఓ ఎత్తు వేసింది.
సాధారణంగా సన్యాసులు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే ము లియాన్
తల్లి తన ఇంటికి వచ్చిన సన్యాసులకు కొన్ని కూరగాయలతోపాటు కొన్ని మాంసం
ముక్కలను కూడా వేసింది. దీంతో తల్లి వెంటనే దేవతల శిక్షకు గురై నరకానికి పోయిందని
ఓ కథ. తల్లిని కాపాడాలనే ఉద్దేశంతో ము లియాన్ కూడా నరకం లోపలకు చొచ్చుకుపోయాడు.
పోగా పోగా, తల్లి ఒకచోట చుట్టూ రక్తంతో కూడి ఉన్న ముళ్ల పరుపుపై కూర్చుని ఉండటం చూశాడు.
తన తల్లికి తినడానికని మూ లియాన్ కాస్త ఆహారం పెడితే అది వెంటనే నిప్పు లేదా రక్తంలా మారిపోయింది.
దీంతో చేసేదేమీ లేక అతడు తిరిగి ఇంటికి పోయి పూజ ప్రారంభించాడు.

మూలియాన్ ప్రార్థనలను ఆలకించిన బుద్దుడు కరిగిపోయాడు. సంవత్సరంలో ఒక రోజున నరక
ద్వారాలు అన్నీ తెరిచి ఉంచాలని, ఆత్మలు ఆ రోజున భూమ్మీదికి వస్తాయని,ఆప్తులైన వారు
వాటికి ఆహార పదార్ధాలు వడ్డించవచ్చని ఆదేశాలు జారీ చేస్తాడు.చాంద్రమాసం ప్రకారం ఏడవనెల
ఏడవ రోజు (జూలై 15)న చైనీయులు అప్పటినుంచి ఆకలిగొన్న దెయ్యం పండుగను పెద్ద ఎత్తున
జరుపుకోవడం మొదలెట్టారు. చైనా సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అయిదు పెద్ద పండుగ
దినాల్లో ఇది ఒకటి.
జూలై 15 రాత్రి చైనాలో ప్రతి ఇంటి ముందు ఆహారం, నీరు ఉంచుతుంటారు.ఇలా చేస్తే దయ్యాలు
తమ ఇళ్లలోకి రాకుండా ఉంటాయని బయటే ఆహారంతిని వెళ్లిపోతాయని, తమకు సమస్యలు
సృష్టించవని చైనీయుల నమ్మకం.ప్రత్యేకంగా కాగితంతో చేసిన డబ్బును ఈ పర్వ దినం సందర్భగా
చైనీయులుతగులబెడతారు.
దయ్యాలు ఆ కాగితాల మసిని తీసుకుని నరకానికి పోయి అక్కడ తమక్కావలసిన వాటిని ఖర్చు
పెట్టుకుంటాయని చెప్పారు. దయ్యాలు తమకు చిక్కులు కలిగించకుండా ఆరోజంతా చైనీయులు
నాటకాలు, రూపకాలు తదితర ప్రదర్శనలలో పాల్గొంటారు.
భూమ్మీద తమ వారసులను కలుసుకోవడానికి జూలై 15న ఆత్మలు, దయ్యాలునరక ద్వారాలను
దాటి భూమ్మీదికి వస్తాయి. ఈ సందర్భాన్నే చైనీయులు దయ్యాల పండుగలాగా జరుపుకుంటారు

.

Saturday, July 18, 2009

సుందరకాండ - 2

నూరామడల దూరం దూకినా కూడా హనుమంతుడికి ఆయూసం కలగలేదు. ఆఖరుకు ఊపిరి కూడా వేగంగా పీల్చలేదు. అందుచేత అతను, ‘‘నేను ఎన్ని నూరామడలైనా దూక గలను. ఈ సముద్రం దాటటం ఏపాటి?'' అనుకున్నాడు. అతను పచ్చిక భూముల మీదుగా, చిన్న పెద్ద కొండలు గల అరణ్యాలమధ్యగా లంకానగరం కేసి నడవసాగాడు. లంకాపట్టణం చుట్టూ సరళ చెట్లూ, కొండగోగులూ, ఖర్జూరాలూ, జంబీరాలూ, కొండ మల్లెలూ, మొగలి పొదలూ, అరటులూ మొదలైన ఎన్నో రకాల చెట్లున్నాయి. అందమైన ఉద్యానాలున్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి, అగడ్తలున్నాయి. ఎవరూ లోపల ప్రవేశించకుండా భయంకరులైన రాక్షసులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. లెక్కలేని కోట బురుజులతోనూ, ధ్వజస్తంభాలతోనూ, ప్రకాశిస్తున్న ఇళ్ళతోనూ అతి మనోహరంగా ఉన్న లంకానగరం ఎత్తున ఉండటం చేత నిజంగానే దేవలోకానికి సంబంధించినట్టుగా ఉన్నది. లంకానగరమూ, దానికి గల రక్షణలూ, రాక్షసుల కాపలా చూస్తూ ఉంటే హనుమంతుడికొక ఆలోచన కలిగింది: వానరులు సముద్రం దాటి ఈ లంకకు ఎలా వస్తారు? నూరు యోజనాల సముద్రాన్ని లంఘించగల వానర వీరులలో హనుమంతుడు గాక, అంగదుడూ, నీలుడూ, సుగ్రీవుడూ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళ మాటేమిటి? మహా వీరుడైనప్పటికీ రాముడిక్కడికి వచ్చి ఈ లంకను జయించగలడా అని హనుమంతుడికి అనుమానం కలిగింది.


విఘ్నేశ్వరుడు - 3

తారకసురుడి నిరంకుశత్వానికి తోడుగా త్రిపురాసులనే ముగ్గురు రాక్షసులు తపస్సు చేసి వరలు పొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే మూడు పట్టణాలను నిర్మించుకొని ముల్లోకాల మీద విరుచుకుపడ్డారు. మూడుపురాల మీద ఎగురుతూ అగ్ని గోళాల్ని కురిపిస్తు,పట్టణాలను,పచ్చని పల్లేలను మీద విరుచుకుపడుతూ విద్వంసకాండ సాగిస్తున్నారు జగ్గత్తు అట్టుడి పోతోంది.వారిని అంతమొందించేగలవాడు శివుడొకడేనని దేవతలందరు భావించి దేవతలందరు కలసి వచ్చి మందిర ప్రాంతంలో ఘోరమైన ప్రార్ధనలు చేశారు. పెళ్ళాడినకొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు విసవిసలాడిన,త్రిపురాసురులు చేస్తున్న మారణహోమం విన్న మీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశులాన్ని దుమ్ము దులిపి పట్టుకొని,తన అనుచరుల్ని,ప్రమధగణాలనూ వెంటబెట్టుకొని,త్రిపురాసులను తుద ముట్టించేందుకు ఆవేశంతో కదిలాడు అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాల్ని బీభత్సం చేస్తూ,ఒక రాక్షస రాజు బయలదేరాడు,బ్రహ్మండమైన ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది.అతడు సాటిలేని గొప్ప శివభక్తుడు. శివుడి వల్ల తప్ప మరొకరివల్ల చావులేని వరం పొందాడు.శివుణ్ణి నీ లోపల ఉంచేసుకుంటే మరీ మంచిదీ కదా!అని నారదుడు గజాసురుని మేలు కోరుతున్నవాడిలాగ అతడితో చెప్పాడు గజాసురుడు వెంటనే కోపాగ్రేశుడై ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణీ మెప్పించాడు.

Friday, July 17, 2009

చైనాలో జరుపుకునే పండుగా(దెయ్యపు పండుగ)

చైనా వ్యాప్తంగా జరుపుకునే విశిష్ట పండుగ దెయ్యపు పండుగ.
దీన్నే హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తుంటారు.
చైనాలో తరతరాలుగా వేళ్లూనుకున్న విశ్వాసాల నేపథ్యంలో
ఈ పండుగ పుట్టింది. దెయ్యపు మాసంగా చెప్పబడే ఈ నెలలో
నరకానికి ఉన్న రెండు ద్వారాలు తెరుచుకుంటాయట.
ఇలా రెండువైపులా నరక ద్వారాలు తెరుచుకున్న సందర్భాల్లో
మనుషులు పెద్దగా గొంతెత్తి అరవడం, ఏడవడం,ఊళ వేయడం
వంటి పనులు చేస్తే అలాంటి వారు సునాయాసంగా చీకటి
ప్రపంచంలోకి లాగివెయ్యబడే ప్రమాదముందని జనం నమ్మిక.
ఈ నెలలో జనం నీళ్లలోకి అడుగుపెట్టకూడదని మరో విశ్వాసం.
నీళ్లలో పొంచుకుని ఉన్న ఆత్మలు ఎవరైనా నీళ్లలో అడుగు
పెడితే చాలు అమాంతంగా లాగేస్తాయట.
దెయ్యాల మాసంగా పిలువబడే జూలై 15 తర్వాత నెల చివరి
వరకూ పెచ్చరిల్లే దెయ్యాలను, ఆత్మలను సంతృప్తి పర్చడానికి
చైనీయులు భారీ ఎత్తున గుమికూడి కలువపూలపై దీపాలు
అమర్చి నీళ్లలోకి వదులుతుంటారు. ఈ దీపాలలో కొవ్వొత్తులను
వెలిగించి నీళ్లలోనూ,గాలిలోనూ ఉంచుతారు.
పెద్ద పెద్ద పూలదండలు తెచ్చి సమాధులలోని దేవతల చిత్రాలను,
డబ్బును ఒకచోట ఉంచి, రాత్రిపూట ఆ డబ్బును తగులబెట్టి డబ్బు
అంటే పడి చచ్చే దెయ్యాలకు సమర్పిస్తుంటారట. ఈ పండుగ
సందర్బంగా ఖాళీ కుర్చీలలో ఎవరూ కూర్చోకూడదు.ఎందుకంటే
అప్పటికే ఏదో ఒక దయ్యం వచ్చి ఆ కుర్చీలో కూర్చుని చూస్తూ
ఉంటుందని జనం నమ్మకం. example:చైనా పురాణాల ప్రకారం, పూర్వం ము లియాన్ అతడి
తల్లి ఓ గ్రామంలో నివసించేవారు. తల్లి క్రూరురాలు. ఎవరైనా
యాచకులు ఇంటికొస్తే బిచ్చం వేయకుండా తరిమివేసేది.తన
బాగు తప్ప ప్రపంచంలో ఇక దేన్ని కూడా పట్టించుకునేది కాదు.
తల్లితో పోలిస్తే ము లియాన్ దయార్ద స్వభావి. ఆపదలో ఉన్నవారిని
ఆదుకోవడం ఇతడి అలవాటు.
ఒకరోజు ములియాన్‌ సన్యాసిగా మారాలనుకున్నాడు.తల్లికి
విషయం తెలియగానే మండిపడింది. ఇంత పనికిరానివాడుగా
తయారయ్యాడంటూ కొడుకును తిట్టింది. తనకోసం కొడుకు బయటకు
పోయి డబ్బు సంపాదించుకు రావాలని కోరుకునేది తప్ప జీవితంలో
మరేదీ ఆమె కంటికి ఆనేది కాదు.

విఘ్నేశ్వరుడు - 2

దేవతలూ, రాక్షసులూ కలిసికట్టుగా క్షర సాగరమథనం చేసి అమృతాన్ని
సాధించారు. విష్ణువు జగన్మోహినీ రూపంతో రాక్షసులను మోసపుచ్చి
అమృతాన్ని దేవతలపాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన
దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యా…ూనికి
దేవతలపై కసి తీర్చుకోడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి,
బ్రహ్మదేవుణ్ణి మెప్పించి, చావులేని వరం కోరాడు.
‘‘పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్ప నిది; మరోవరం ఏదైనా కోరు,
ఇస్తాను,'' అన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసురుడు బాగా ఆలోచించి
శివుడి కుమారుడివల్లనే తప్ప మరేవిధంగానూ తనకు చావులేని
వరాన్ని బ్రహ్మనుంచి పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షƒ
…ుజ్ఞంలో ెూగాగ్నితో తనువు చాలించింది. శివుడు ఉన్మత్తుడిలాగ
తిరిగి, తిరిగి హిమాల…ు పర్వతాల్లో ఒకచోట విరాగిగా కఠోర దీక్షతో
తపస్సు చేస్తూ ఉన్నాడు.
తారకాసురుడు రాక్షసులందర్నీ కూడ గట్టుకొని విజృంభించాడు.
ముల్లోకాలనూ ఆక్రమించుకుని, కసితీరా దేవతలను చిత్ర హింసలు
పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడలిపోయి, తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ‘‘శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే
తారకుడు చావాలి! అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి.
ఇంకెరివల్లా తారకాసురుడికి ఎటువంటి హానీజరగదు.
మరోవిధంగా అతడికి చావూ లేదు!''అని బ్రహ్మ చెప్పి దేవతలను
వెంటబెట్టుకుని తరుణోపా…ుం కోసం విష్ణువు దగ్గరికి దారి తీశాడు.
‘‘సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ
ఉన్నది. శివుడికి పార్వతికి పెళ్ళిజరిగేలా చూడండి!'' అని విష్ణువు
చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమ వంతుడి దగ్గరికి పంపించారు
.

Wednesday, July 15, 2009

సుందరకాండ

జాంబవంతుడు ప్రోత్సాహం ఇవ్వగా హనుమంతుడు రామముద్రికతో
సహా లంకకు దాటి,రావణుడు సీతను ఉంచిన స్థలం కనిపెట్ట
నిశ్చయించుకున్నాడు. అతను శరీరాన్ని పెంచి,
మహేంద్రగిరి పైన అటూ ఇటూ తిరుగుతూ, పెద్ద వృక్షాలను తన
రొమ్ముతో కూలదోస్తూ,మృగాలను చంపుతూ కొంతసేపు సంచరించాడు.
బయలుదేరే ముందు అతను సూర్యుడికీ, ఇంద్రుడికీ, వాయుదేవుడికీ,
బ్రహ్మకూ నమస్కారాలు చేసి,మహేంద్రపర్వతం మీద చేతులూ, కాళ్ళూ
ఆనించి ఒక్క ఊపు ఊపాడు. చలనం ఎరగని మహేంద్రపర్వతం ఆ ఊపుకు
కంపించిపోయింది. దాని మీది శిలలు బద్దలయ్యూయి. గుహలలో ఉండే
ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. పర్వతం మీద ఉండే విద్యాధరులు కంగారు
పడి ఆకాశంలోకి ఎగిరారు.ఋషులూ, చారణులూ, సిద్ధులూ హనుమంతుడు
సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళేయత్నంలో ఉండటం గురించి మాట్లాడు
కోసాగారు. హనుమంతుడు తన శరీరం మీది రోమాలను విదిల్చి, ఒక్క
పెడబొబ్బ పెట్టాడు.ఒకసారి దూరం కేసీ, ఒకసారి ఆకాశం కేసీ చూసి,
తన సమీపంలో ఉన్న జాంబవంతుడు మొదలైన వారితో, ‘‘నేను రామబాణం
లాగా వేగంతో లంకకు పోతాను, అక్కడ సీత కనిపించకపోతే అదే వేగంతో
స్వర్గానికి వెళతాను. అక్కడ కూడా సీత లేని పక్షంలో తిరిగి లంకకు వెళ్ళి,
ఆ రావణుణ్ణి బంధించి ఇక్కడికి తెస్తాను. అదృష్టం కలిసివస్తే సీతను తెస్తాను

విఘ్నేశ్వరుడు 1

సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని, పగలంతా సృష్టి చేసి,
చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది.
ఆ నిద్రమత్తులో ఆ…ున ఆవులించినప్పుడల్లా పర్వతశిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను
వెదజల్లాయి. నిద్రపటే్ట సమ…ూన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు,
గుంపులుగా కూడిన ప్రళ…ు మేఘాలు మెరుపులతో, భ…ుంకరంగా గర్జిస్తూ,
ఏనుగు తొండాలవంటి ధారలతో వర్షించి, లోకాన్ని జలమ…ుం చేశాయి.
ఆ…ున కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా
గాఢాంధ కారం అలుముకున్నది. ఈప్రళ…ు పరిస్థితిలో బ్రహ్మ నిద్రిం చాడు.
ఆ…ునకు ప్రళ…ుమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభంకానున్న
సమ…ుం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న
తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా
పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది.
ఆ…ున పద్మాసనం వేసి కూర్చుని, నాలుగు ముఖాలతో, నాలుగు దిక్కులూ
కల…ుచూశాడు. కిందవున్న జగత్తు అంతా నీటిమ…ుమై మహాపర్వతాల్లాంటి
కెరటా లతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొల్పే తెల్లని కాంతిరేఖకనిపించింది. ఆ కాంతిలో తరంగా లపై తేలుతూ ఒక పెద్ద మర్రి ఆకు,
దానిపై చందమామలాంటి పసివాడు పడుకుని కుడి కాలి బొటనవేలు చప్పరిస్తూ
కనిపించాడు.
బ్రహ్మ చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరచినంతలో ఒక వింత
దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని--
బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసినవిష…ుమే. కాని ఇప్పుడా పిల్లవాని
తల ఏనుగు తలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో
పెట్టుతూన్నట్టుగా కనిపించింది.

Saturday, July 11, 2009

మొట్ట మొదటి పాత్ర రామయణంలో:ఋశ్య శృంగుడు

మొట్ట మొదటి పాత్ర రామయణంలో:ఋశ్య శృంగుడు కధ ప్రారంభం: ఋశ్య శృంగుడు విభాండకమహర్షి కుమారుడు భాండకుని వలన అతడు లేడికి కలిగిన సంతాన మని పురాణకధ ఉంది అతడున్న ప్రదేశం (ఇప్పుడు మన మనుకునే శౄంగేరి పీఠం)సకాలంలో వర్షములు కురిసి సశ్యశ్యామలంగ ఉంటుంది పుత్రకామేష్ఠి యాగంలో ఈ మహర్షి పాల్గొన్న తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది వేద పారంగుడయిన ఋశ్య శృంగుడు తండ్రి ఆశ్రమమునందే తపస్సు చేసుకునేవాడు లోకమునందలే వ్యవహార జ్ఞానం బొత్తిగా తెలియదు.ఎన్నడు కూడ స్త్రీముఖం చూసి ఎరుగడు.అంతేకాదు తండ్రి తప్ప మరొక పురుషుని చూడలేదు రోమ పాదుడనే అంగ దేశదీశుడు ధర్మోల్లంఘనం చేసినందువలన ఆ దేశంలో బహుకాలం వర్షములు కురియలేదు.ఋశ్య శౄంగుని దేశంలోకి రప్పించిన వర్షములు కురుస్తాయని రాజపురోహితులు,మహర్షులు చెప్పారు.వారి ఆ దేశనుసారం ఋశ్య శౄంగుడిని తన రాజధానికి రప్పించడానికి రోమపాదుడు అనేక ప్రయత్నములు చేసి నిస్సహయుడై చివరకు ఉహా తట్టి వేశ్యలను పంపేడు ఋశ్య శౄంగుని ఆశ్రమం దాపులోనే రోమపాదును వేశ్యలు రాజ శిబిరాలు ఏర్పరుచుకొని నాట్యం చేయసాగరు తపస్సు తప్ప మరొక భావం లేని ఋశ్య శ్రుంగుడు ఆ వేశ్యలను గాంచి వారిని మహర్షులుగాను వారి రాజ శిబిరాలను ఆశ్రమాలుగాను భావిస్తాడు సంగీత సాహిత్యముల సమ్మేళనంతో రూప లావణ్య వతులైన వేశ్యములు చేసే నాట్యం ఆయనను ఎంతగానో ఆకర్షించాయి ఆ వేశ్యలందరు,సుఖుమార దేహాలకు ఋశ్య శౄంగుని ఆలింగనం చేసుకొని వివిధ బక్ష బోజ్యలు అమర్చి ఆ మహర్షికి అందజేస్తే అవి ఆరగించి వానిని అపూర్వ పుణ్యఫలాలుగా భావించాడు ఇంతటి అపూర్వమైన తాపసుల ఆశ్రమములు ఎంత రమ్యంగా ఉంటయో కధ!అని భావించిన ఋశ్య శౄంగుని,వేశ్యలు తమవెంట ఆహ్వనించారు.ఋశ్య శౄంగుడు చక్కగా అలంకరించిన రధంలో కూర్చుని వస్తుండగా వెనుకవైపునుండి వర్షధారలు మొదలయి రోమపాదుని రాజ్యమంత వర్షం కురిసి శుభిక్షమయింది తన రాజ్యానికి విచ్చేసిన మహర్షికి రోమపాదుడు తన పెంపుడు కుమార్తే అయిన శాంత నిచ్చి వివాహం జరిపించి కొంతకాలం తన రాజధానిలోనే ఉంచుకున్నాడు శంత ఋశ్య శౄంగులకు చతురంగుడుఇ అనే కూమారుడు కలిగేడూ కొంతకాలం తరువాత దశరధుడు పుత్రకామేష్ఠి యాగం జరుప నిశ్చయించగా మహర్షులు ఋశ్య శౄంగుని మహత్తు తెలియపరచి ఆయనను పిలిస్తేనేగాని యజ్ఞం సఫలంకాదు అని చెప్పారు .వెంటనే దశరధుడు శంత,ఋశ్య శౄంగులను యాగని ఆహ్వనించాడు యజ్ఞం పూర్తిగాగాని ఋశ్యశౄంగుడూ భార్య శౄతులతో సహ తన ఆశ్రమనికి వెళ్ళడు ఈ విధంగా శ్రీ రాముని పుట్టుకకు ఋశ్య శౄంగుని ప్రమేయం ఎంతో ఉంది పుత్ర కామేష్థియాగ ఫలంలో ఋశ్య శ్రుంగుడు ప్రధాన పాత్ర